స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం “అల వైకుంఠపురములో”. 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సీనియర్ నటి టబు, నవదీప్, మురళి శర్మ, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే సినిమాలోని రెండు పాటలు విడులైన సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తమన్ స్వరకర్త. చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ టబు తెలుగులో నటిస్తుంది. ఈ చిత్రంలో టబు బన్నీ అమ్మ పాత్రలో నటిస్తుందని సమాచారం. టబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ చిత్రంలో టబు జయరాం సరసన నటిస్తున్నారు.
Wishing #Tabu a very Happy Birthday, We look forward to many more collaborations – #AlaVaikunthapurramuloo team!@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman #Jayaram #NivethaPethuraj @iamSushanthA @pnavdeep26 @Mee_Sunil #PSVinod @GeethaArts @vamsi84 @adityamusic pic.twitter.com/bs20Qll1dD
— BARaju (@baraju_SuperHit) November 4, 2019