telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్ర బాబు బెయిల్ ఆర్డర్ లో ఏ ముంది ?

తెలుగు దేశము పార్టీ జాతీయ అధ్యక్షులు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారిపైన పెట్టిన స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని , రాజకీయంగా ఆయన్ని కావాలనే ఇబ్బంది పెట్టారని ఇప్పుడు అందరికీ స్పస్టమైనది .

సోమవారం రోజు చంద్ర బాబు నాయుడు గారికి హై కోర్ట్ బెయిల్ మంజూరి చేసింది . అయితే ఆ బెయిల్ ఆర్డర్ లో ఏ ముంది? కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటి?

బెయిల్ ఆర్డర్ లో న్యాయమూర్తి పేర్కొన్న అంశాలు ఈ క్రింది విధంగా వున్నాయి
బెయిల్ దరఖాస్తు పరిశీలన దశలో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ…ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో నిర్థారించుకోవడానికి కనీస పరిశీలన అవసరం.
రూ.370 కోట్లు నగదు రూపంలో తీసుకుని అవినీతికి పాల్పడ్డారన్న అరోపణకు సిఐడి ఎలాంటి సాక్ష్యాలు చూపించలేకపోయింది. అవినీతి జరిగిందని చెపుతున్న డబ్బును తెలుగు దేశం పార్టీ ఖాతాలకు మళ్లించారు అనేందుకు ఎటువంటి రుజువులూ లేవు.

పార్టీ ఖాతాల్లోకి డబ్బు మళ్లించారన్న తీవ్రమైన ఆరోపణలు చేసినప్పుడు…వాటి ఆధారంగా రిమాండ్ కోరినప్పుడు దర్యాప్తు సంస్థ సిఐడి వాటికి సాక్ష్యాధారాలు చూపించి ఉండవలసింది. తద్వారా కోర్టు రిమాండ్ ను తప్పు పట్టింది. ఏ రకమైన ఆధారాలు లేకపోవడం సిఐడి దర్యాప్తు లోపంగా కోర్టు వ్యాఖ్యానించింది.
సిమెన్స్ సంస్థ తన పని సరిగా చేయలేదని సిఐడి వాదించలేదు. ఇదే కేసులో ఎ4 కు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో హైకోర్టు చెప్పిన తీర్పును ఉటంకించింది. పథకంలో 2.13 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందిన విషయాన్ని ప్రస్తావించింది.

పలువురు నిందితుల మధ్య వాట్స్ యాప్ సందేశాలు నడిచినట్లు దర్యాప్తు సంస్థ చెపుతోంది కానీ…అందులో ఈ కేసులో నేరాన్ని ఎక్కడా చూపించలేకపోయింది. ఈ చాట్ ఆధారంగా నగదు ఎక్కడి నుంచి వచ్చింది…లావాదేవీలు ఎందుకు జరిగాయి అనేది నిర్ధారించడం సాధ్యం కాదని సిఐడి స్వయంగా అంగీకరించిన విషయాన్ని కోర్టు రికార్డు చేసింది.

శరత్ అండ్ అసోసియేట్స్ సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుపై సిఐడి విపరీతంగా ఆధార పడింది కానీ…ఆ నివేదికే సవాలక్ష షరతులతో వచ్చిందని వాటిపై ఆధారపడి ఒక నిర్ణయానికి రాలేమని కోర్టు పేర్కొంది. ఒప్పందాల్లో తేడాలు ఉంటే దానికి సిఎం ఎలా బాధ్యులు అవుతారు అని కోర్టు ప్రశ్నించింది.
సీమెన్స్ ను ఈ సేవలకు ఉపయోగించుకోవాలని వారికి డబ్బులు విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయంలో ఐఎఎస్ అధికారి శ్రీమతి సునీత కూడా భాగస్వామి అన్న విషయాన్ని కోర్టు నమోదు చేసింది.
సునీత తప్పు చేసినట్లు కానీ…ఆమెపై చర్యలు తీసుకున్నట్లు కానీ సిఐడి ఎక్కడా చెప్పలేదు.

ముఖ్యమంత్రికి విశేష అధికారాలు లేవని కూడా సిఐడి వాదించలేదు. నిధులు విడుదల చేయాలి అని ఆదేశించినంత మాత్రాన ఆధారాలు లేకుండా ఆ నిధులు పార్టీ ఖాతాకు మళ్లించారనడం సరికాదని పేర్కొంది.
సబ్ కాంట్రాక్టర్ల తప్పిదాలు చేసి ఉంటే దానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యడు అవుతారన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది.

కార్యక్రమంలో తప్పులేమైనా జరిగినట్లు అధికారులు…నాటి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు లేవని కోర్టు పేర్కొంది. అక్రమాలు జరిగినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు తేల్చినట్లు పేర్కొన్న సిఐడి…దానికి అవసరం అయిన ఆధారాలు మాత్రం చూపలేదు.
బెయిలుపై బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అనే సిఐడి వాదనను కోర్టు కొట్టేసింది.
కేసు దాఖలు అయ్యాక ఏడాది పది నెలల్లో అప్పటి సిఎం కేసును ప్రభావితం చేశారని సిఐడి కూడా ఎక్కడా చెప్పలేదు. మితిమీరి షరతులు విధిస్తే….ఎన్నికల్లో పిటిషనర్ కు చెందిన రాజకీయ పార్టీపై , కార్యకలాపాలపై ప్రభావం పడుతుందన్నారు

Related posts