సూర్యాపేట పట్టణ కేంద్రంలో రోడ్ల విస్తరణ చేపట్టారు. ఇందులో చాలా మంది ఇల్లు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం మంత్రి జగదీష్ రెడ్డిని అయన క్యాంప్ కార్యాలయంలో బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి వారికి బరోసా కల్పించారు. రోడ్ల విస్తరణలో పూర్తిగా నష్టపోయిన వారికి అండగా ఉంటానని జగదీష్ రెడ్డి తెలిపారు.
ఇండ్లు పూర్తిగా కొల్పోయిన నిర్వాసితులకు రెండు పడక గదుల ఇండ్లు, పూర్తిగా దుకాణాలు కొల్పోయిన వారికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో దుకాణాల కేటాయింపులు చేస్తామని చెప్పారు. ప్రజల అవసరాల మేరకే రోడ్ల విస్తరణ చేపట్టాల్సి వచ్చిందన్నారు. విస్తరణకు సహకరించిన వర్తక, వాణిజ్య, వ్యాపార వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ ఒక్కరినీ నష్టపోనివ్వమని వారికి పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా