telugu navyamedia
రాజకీయ వార్తలు

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం.. బీజేపీని ప్రజలు తిరస్కరించారన్న దీదీ

mamatha benerji

పశ్చిమ బెంగాల్ లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించింది. మూడు దశాబ్దాల తర్వాత ఖరగ్ పూర్, కలియాగంజ్ స్థానాల్లో టీఎంసీ విజయపతాకం ఎగురవేసింది. ఈ మూడు స్థానాల్లో రెండు చోట్ల గత 30 ఏళ్లలో టీఎంసీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ ఘన విజయాలతో, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఈ సందర్భంగా టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాజకీయ అహంకారానికి బెంగాల్ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదని చెప్పారు. బీజేపీని ప్రజలు తిరస్కరించారని తెలిపారు.

Related posts