telugu navyamedia
క్రైమ్ వార్తలు

విద్యార్ధులు ఘ‌ర్ష‌ణ‌..నిండు ప్రాణం బ‌లి..

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది . వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బిట్స్​ కాలేజ్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పాలిటెక్నిక్ చదువుతున్న ఐదుగురు విదార్థుల మధ్య శుక్రవారం రాత్రి వసతి గృహంలో గొడవ జరిగింది. చిన్న వాగ్వాదం కాస్త ముదిరి పెద్ద గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. సంజయ్‌ అనే మరో విద్యార్థిని కాలేజ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి తోసేశారు. ఈ ప్రమాదంలో సంజయ్‎కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు.

వివార్లాలోకి వెళితే..
హనుమకొండ జిల్లా కమలాపురం మండలానికి చెందిన విద్యార్థి సంజయ్ కుమార్​(17).. వసతి గృహం రెండో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. సంజయ్​ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఘర్షణలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన సిబ్బంది, తోటి విద్యార్థులు.. క్షతగాత్రుడిని హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంజయ్‌ మృతి చెందాడు. విద్యార్థి మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు చనిపోయాడని సంజయ్‌ తల్లిదండ్రులు.. ఎంజీఎం ఎదుట ఆందోళన చేపట్టారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్ మృతదేహంపై గాయాలు ఉండటంతో విద్యార్థుల మధ్య ఘర్షణ వల్లనే కింద పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల వద్ద ఎలాంటి ఘర్షణ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts