ఎవరి నమ్మకాలు వాళ్ళవి, నమ్మిన వారికి నమ్ముకున్నంత.. ఇవన్నీ వినే ఉంటాం కదా.. ఒకరి నమ్మకాన్ని ఇష్టానికి చులకన చేస్తే, దానిపరిణామాలు ఎంతవరకైనా వెళతాయి. అదే చోటుచేసుకుంది తమిళనాడులోని ప్రఖ్యాత కంచి కామాక్షమ్మ దేవాలయంలో. ఆలయంలో కెమెరాలు తదితర అనుమతించారు, ఒకవేళ మొబైల్ లాంటివి తీసుకొచ్చినా ఫోటోలు గట్రా తీయరాదు.. ఈ నియమాన్ని తప్పి, బంగారు బల్లిని ఫోటో తీయబోయాడు ఒక తెలుగు యువకుడు, అంతే పోలీసులు కల్పించుకొని, తీవ్రంగా కొట్టడంతో అతగాడు మృతిచెందాడు.
మృతుడిని ఆకాశ్ గా గుర్తించగా, రాజమండ్రి వాసిగా తెలుస్తోంది. తెలుగు భక్తుని మృతిపై కంచి దేవాలయంలో ఇతర భక్తులు ఆందోళనకు దిగిన వేళ, కొంత ఉద్రిక్తత నెలకొంది. జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు వెల్లడించారు.