వివేకా హత్యాగు గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన కుమార్తె నేడు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిట్ ని నియమించారు కాబట్టి, దానిపని దానిని చేసుకోనివ్వండి.. సొంత అభిప్రాయాలు సిట్ అబిప్రాయాలుగా చెప్పకండి, ప్రచారం చేయకండి అంటూ వాపోయారు. తన తండ్రిని అత్యంత క్రూరంగా హత్య చేశారని, దానిపై విచారణకు సిట్ టీమ్ ఏర్పాటు అయినా, పారదర్శకంగా విచారణ సాగడం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆరోపించారు.
సొంత కుటుంబీకులే పెద్దాయనను చంపారని ప్రతి బహిరంగ సభలో చంద్రబాబు చెప్పడం ఆయన పైశాచిక రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించిన ఆమె, తన పనిని తాను చేసుకునేందుకు సిట్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. తమ కుటుంబంలో దాదాపు 700 మందికి పైగా ఉన్నామని, ప్రతి కుటుంబంలోనూ ఏవో కొన్ని విభేదాలుంటాయని, అంతమాత్రాన హత్యలు చేసుకుంటారా? అని ప్రశ్నించారు.
తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, బెంగళూరులో ఉన్న భూమిపై వివాదం గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు. సిట్ విచారిస్తున్న సమయంలో తాను విచారణపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయాలని భావించడం లేదని, ఈ విషయంలో తన అభిప్రాయం కన్నా, తేల్చాల్సిన సంగతులే ముఖ్యమని అన్నారు. హత్య సమయంలో తన తండ్రి రాసిన లేఖ ఆయన స్వయంగా రాసిందా? కాదా? అన్న విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ తేలుస్తుందని చెప్పారు.
జగన్తో కేసీఆర్ కొత్త బంధాలు: లక్ష్మణ్