ఏపీ సీఎం జగన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త బంధాలు ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఏపీలో మాదిరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ సమస్యలపై కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు.
ఎస్మా, పీడీ యాక్ట్ పేరుతో కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని, ఆర్టీసీని ప్రభుత్వమే నష్టాల ఊబిలోకి నెట్టిందని లక్ష్మణ్ మండిపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళకుండా కేసీఆర్ మొహం చాటేశారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రాజక్టుల పేరుతో ఇద్దరు సీఎంలు కమీషన్లు దండుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు.