కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పదవి అప్పగించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తిస్తాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి ప్రతిపాదనలు తయారుచేసే కీలక పనిని అప్పగించారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కేబినెట్ హోదా కలిగి ఉండడంతో పాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటాఋ. వినోద్కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగనున్నట్లు కేసీఆర్ తెలిపారు. రాజకీయాల్లో, పరిపాలనా అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు ఆర్థిక అంశాలపట్ల అవగాహన కలిగిన వినోద్కుమార్ కు ఈ పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది.
‘నమో’ యుగం అంతమవబోతోంది: మాయావతి