telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై స్పందించిన యూపీ ఏడీజీపీ!

UP adgp prashanth kumar

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై అడిషనల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఎన్ కౌంటర్ కు సంబంధించిన అన్ని విషయాలూ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరంలేదన్నారు.

తాము ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోతే, ప్రతి విషయంలోనూ ప్రశ్నలు వస్తాయని అన్నారు. ఈ ఘటనలో అందరికి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై చెప్పాల్సిన వారికి మాత్రమే వివరాలను అందిస్తామని తెలిపారు.

Related posts