గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ నిర్వహించిన బీటెక్ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ ఆన్లైన్ పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వర్సిటీ వీసీ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. ఆన్లైన్ పరీక్షలు పూర్తి చేసిన వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామని ఆయన తెలిపారు.
విద్యార్థులకు ఆన్లైన్ రియల్ టైమ్ వీడియో మానిటరింగ్ సిస్టమ్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రెండో సెమిస్టర్ పరీక్షలను 99 శాతం హాజరుతో విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్, డీన్ పీఎంవీ రావు తదితరులు పాల్గొన్నారు.
కుట్రలను బహిర్గతం చేసేందుకే ఢిల్లీకి : మంత్రి ప్రత్తిపాటి