telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు జోలెతో ఊరేగుతున్నాడు: విజయసాయి

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ లో విమర్శలు చేశారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక అజెండా లేదు, ప్రజాసమస్యలపై గళమెత్తిన సందర్భంలేదని చంద్రబాబును దుయ్యబట్టారు. ఇసుక మాఫియాను కాపాడేందుకు కొరత అంటూ రంకెలేశాడని విమర్శించారు.

చంద్రబాబు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవతారమెత్తి జోలెతో ఊరేగుతున్నాడని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లోపేర్కొన్నారు .రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులకు ర్యాంకింగ్స్ ఇస్తే చంద్రబాబుకు చివరిస్థానం కూడా దక్కదని విజయసాయి ఎద్దేవా చేశారు.

Related posts