telugu navyamedia
సినిమా వార్తలు

తన అవార్డును వేణుమాధవ్ కు అకింతమిచ్చిన వెన్నెల కిషోర్

Vennela-Kishore

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ క‌మెడియ‌న్స్ లిస్టులో వెన్నెల‌కిషోర్ పేరు ముందు వ‌రుస‌లో ఉంది. ఆదివారం రాత్రి జ‌రిగిన సంతోషం 17వ సౌతిండియా అవార్డ్స్‌లో వెన్నెల‌కిషోర్‌కి సీనియ‌ర్ కమెడియ‌న్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత అల్లు రామ‌లింగ‌య్య స్మార్మ‌క అవార్డ్ ద‌క్కింది. ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేసిన వెన్నెల‌కిషోర్ ఈ అవార్డుని ఇచ్చిన జ్యూరీ స‌భ్యుల‌కు, సంతోషం సురేశ్‌కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే త‌నకు వ‌చ్చిన ఈ అవార్డుని రీసెంట్‌గా అనారోగ్యంతో క‌న్నుమూసిన క‌మెడియ‌న్ వేణుమాధ‌వ్‌కి అంకిత‌మిచ్చారు. వేణు మాధవ్ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా ఆయ‌న రాణించారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కి ఆయ‌న యాంక‌ర్‌గా కూడా ప‌ని చేశారు. రాజ‌కీయాల‌లోను చురుకుగా ప‌ని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాల‌లో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాల‌లో హీరోగా చేశారు. ఆయ‌న‌కి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అనారోగ్య కార‌ణాల వ‌ల‌న ఐదేళ్లుగా సినిమాల‌కి దూరంగా ఉన్నారు వేణు మాధ‌వ్. చివ‌రిగా రుద్ర‌మ‌దేవి చిత్రంలో కనిపించారు. వేణుమాధవ్ అంత్యక్రియలు మౌలాలీలో ఆయన అభిమానుల మధ్య ముగిశాయి.

Related posts