బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ కార్యక్రమం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా… ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ రెడ్డి బయటకి వెళ్ళారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈవారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్. 41వ ఎపిసోడ్లో ఛలో ఇండియా టాస్క్కి సంబంధించి బాబా భాస్కర్ పలు విషయాలు ఇంటి సభ్యులతో చర్చించారు. అలీ, రవి ఇద్దరు ఒకచోట కూర్చొని బాబా భాస్కర్, మహేష్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ అనే దాని గురించి చర్చించారు . ఇలా చర్చలు జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ కెప్టెన్ టాస్క్ ఇచ్చారు. మట్టిలో ఉక్కుమనిషి అనే టాస్క్లో భాగంగా రాహుల్, వరుణ్, బాబాలకి ఒక్కో కలర్ రంగు బాల్ అసైన్ చేశారు. వాటిని మట్టిలో నుండి తీసి బాస్కెట్లో వేయాలన్నారు. ఇలా మట్టిలో బాల్స్ వెతికే ప్రక్రియలో ఒకర్నొకరు అడ్డుకోవచ్చని కూడా పేర్కొన్నారు.
పోటాపోటీగా జరిగిన కెప్టెన్ టాస్క్లో వరుణ్ సందేశ్ ఎక్కువ బాల్స్ వేయడంతో ఆయన మరోసారి ఇంటి కెప్టెన్గా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఇంటి సభ్యులకి ఆయా ఏరియాలకి సంబంధించిన పనులని అప్పగించారు. కెప్టెన్ టాస్క్ ముందు నేను కనుక కెప్టెన్ అయితే ఇంట్లో డ్రెస్ కోడ్ పెడతానంటూ బాబా చెప్పుకొచ్చారు. పొట్టి దుస్తులు కట్, అలీ బాత్ రూంకి వెళ్లేటప్పుడు దుప్పటి తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు మొత్తం కప్పుకొని రావాలని బాబా ఆదేశించారు. దీని గురించి ఫన్ డిస్కషన్ జరిగింది. ఆరోవారంలో లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్ బాస్ రంగుపడుద్ది అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో కెప్టెన్గా వరుణ్ని ఓ వీల్కి కట్టేసి ఆయన చుట్టు ఉన్న లగ్జరీ బడ్జెట్ని రంగు బెలూన్స్తో కొట్టాలని బిగ్ బాస్ తెలిపారు. ఏ ఐటమ్ రంగుబాల్తో తడుస్తుందో ఆ వస్తువు లగ్జరీ బడ్జెట్గా వస్తుందని పేర్కొన్నారు. ఇది పూర్తైన తర్వాత ఛలో ఇండియా టాస్క్లో నెగ్గిన అలీ, రవి, బాబా భాస్కర్ తమకి నచ్చిన బడ్జెట్ కూడా తీసుకోవచ్చని తెలిపారు బిగ్ బాస్. రాహుల్కి శ్రీముఖి ఫీవర్ ఇంకా తగ్గడం లేదు. బయట క్లోజ్ ఫ్రెండ్స్గా వీరిద్దరు ఇంట్లో మాత్రం బద్ద శత్రువులుగా మారారు. ఈ రోజు నాగ్ ఎంట్రీ ఉండడంతో 42వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుంది.