మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. రవీంద్ర యాదవ్గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మగా రకుల్ ఆకట్టుకుంటున్నారు.
గిరిజన ప్రాంతం నేపధ్యంలో నడిచే కథాంశంతో మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. రకుల్ మేకలు కాసుకునే పూర్తి గ్రామీణ యువతిగా కనిపించింది. నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన యువకుడిగా తేజ్.. ఆయన తండ్రి పాత్రలో సాయిచంద్, తాత పాత్రలో కోట శ్రీనివాస్ కనిపించారు.
‘గొర్ల కాపరుల కుటుంబం..తల్లిదండ్రులకు చదువు లేదు..ఏ కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకున్నారు..అని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన వైష్ణవ్ తేజ్ ను బోర్డు మెంబర్ నాజర్ అడుగగా..నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా’ సార్ అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పే సంభాషణలతో ట్రైలర్ మొదలైంది.
ఇక రకుల్, వైష్ణవ్ మధ్య సాగే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ‘చదువుకున్న గొర్రె చదువురాని మరో గొర్రెతో మాట్లాడటం చూశావా?’ అంటూ రకుల్.. వైష్ణవ్ ఆటపట్టిస్తూ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది.
ఈ ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు పాత్రలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది.
ఇక ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది.ఎం. ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. క్రిష్ దర్శకుడు. రాజీవ్ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలు వ్యవహారిస్తున్నారు..