తెలంగాణ గడ్డపై కరోనా బారి నుంచి ప్రతీ ఒక్కరినీ కాపాడేవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ, వారికి అండగా నిలుస్తూ భరోసా ఇస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదలచేశాడు నటుడు ఉత్తేజ్. ప్రస్తుతం ఉత్తేజ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు, అలుపులేకుండా ప్రజాశ్రేయస్సే పరమావరిధిగా తన పరిపాల దక్షతతో సరైన నిర్ణయాలతో తెలంగాణ గడ్డపై ప్రతీ ఒక్కరినీ కాపాడేవిధంగా కొండంత అండగా నిలువెత్తు మానవత్వంతో మనందరికోసం, మనకోసం నడుస్తున్నందుకు కేసీఆర్ సర్ నిన్ను నాయినా అని పిలవాలని ఉందే పిలవనా.. మొన్ననిన్ను టీవీలో చూసినంక నీ మాటలు ఇన్నంకా నీ చెయ్యితోని మా కండ్ల నీళ్లు తుడిచినట్టు.. మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పినట్టు మా ఇంట్లో మనిషివైనట్టు కొట్టిందే.
నిన్ను నాయినా అని పిలవాలనుంది పిలవనా నాయినా. మొన్న నువ్వు ఇచ్చిన భరోసాకు ఆల్లు ఈల్లని కాదు మొత్తం అందరు ఊపిరి పీల్సుక్నురు. మేం చేసుకున్న అదృష్టమే నువ్వు. ఇది నా ఒక్కడి మాట కాదు, తెలంగాణ వాళ్లే కాదు తెలుగు వాళ్లందరి మాట. అందరు సల్లగుండాలె మనుషులు పోతే వస్తరా అని మానవ వనరుల విలువలు చెప్తివి. తెలంగాణ బిడ్డలే కాదు ఈ గడ్డమీద వున్న ఏ బిడ్డ కూడా ఉపాసం పండొద్దని అమ్మలెక్క అర్సుకున్నవ్. అప్పుడెప్పుడో ఎనకట శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమెత్తి గోవులను కాపాడినట్టు కరోనా బారిన పడకుండా ఆ గడ్డ మీదున్నోళ్లు ఓటర్లు కాదు మనుషులని కాపాడినవ్. కనపడన వాడు దేవుడైతే నాయినా నువ్వు మాకు కనిపించే దేవునివి. ’అంటూ ఉత్తేజ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.