ఇతర పార్టీలతో పొత్తు అనైతికం కాదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. శివసేన అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు చేయడం ఎలా అనైతికం అవుతుందని ప్రశ్నించారు.
మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలకు కారణం బీజేపీనే అని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ పొత్తుపెట్టుకోలేదా? అని నిలదీశారు. “అయినా మేం బీజేపీని ఏం అడిగాం… నింగి నుంచి చంద్రుడ్ని తీసుకురమ్మన్నామా? లేక చుక్కల్ని తీసుకురమ్మన్మామా?… మా తండ్రి గారి కోరిక మేరకు ఓ శివసైనికుడ్ని సీఎం చేయమని అడిగాం” అంటూ బీజేపీపై విమర్శలు చేశారు.
సాధ్వి ప్రజ్ఞా సింగ్ ముమ్మాటికీ ఉగ్రవాదే: సిద్ధరామయ్య