telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వాట్సాప్ సరికొత్త ఫీచర్

whatsup

వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న ‘డార్క్‌మోడ్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఇంటర్నెట్‌లోని సమాచారం సాధారణంగా తెల్లని బ్యాక్ గ్రౌండ్‌పై నల్లని అక్షరాల రూపంలో ఉంటుంది. దీనివల్ల కళ్లకు అధిక శ్రమ కలుగుతుంది. ఇప్పుడు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చిన డార్క్‌మోడ్ వల్ల బ్యాక్‌గ్రౌండ్ నల్లగా ఉండి, అక్షరాలు మాత్రం తెల్లగా ఉంటాయి. ఫలితంగా కళ్లు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. ముఖ్యంగా రాత్రివేళ వాట్సాప్‌ను ఉపయోగించే వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. ఈ సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు తొలుత సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే చాట్‌పై క్లిక్ చేస్తే థీమ్ అని కనిపిస్తుంది. అందులో లైట్, డార్క్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. డార్క్‌మోడ్‌ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ వారం మొదట్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా, తాజాగా నేటి నుంచి మనదేశంలోని యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు డార్క్‌మోడ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోనున్నారు. అయితే, ఆండ్రాయిడ్ 10, ఐవోఎస్ 13లలో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. డార్క్ గ్రే కలర్ బ్యాక్ గ్రౌండ్‌తో ఉన్న ఈ సరికొత్త ఫీచర్ వల్ల రాత్రివేళ తక్కువ లైటింగ్ వెదజల్లుతుంది.

Related posts