టాలీవుడ్ మెగా హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ షాకిచ్చింది. టి.యస్ ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు మెగా హీరో అల్లు అర్జున్ తో పాటు రాపిడో సంస్థకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లీగల్ నోటీస్ లు ఇచ్చారు.
తాజా గా అల్లు అర్జున్ నటించిన రాపిడో యాడ్ పై టీ ఎస్ ఆర్టీసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ యాడ్ లో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని అల్లు అర్జున్ అంటాడు.
అలాగే రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని ఆ యాడ్ లో అల్లు అర్జున్ అంటాడు. ఆ సమయంలో మసాలా దోస సిద్ధం అవుతుందని, రాపీడో యాడ్ లో అల్లు అర్జున్ అంటాడు. దీంతో యాడ్ పై ఆర్టీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలకు ఆర్టీసీ బస్సుల విషయంలో తప్పుగా చెబుతున్నట్టు ఉంది.
దీంతో ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ తో పాటు రాపీడో సంస్థ కు నోటీసులు జారీ చేశారు.
ఈ విషయం పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీని కించపరచడాన్ని ఎవరూ కూడా సహించరని అన్నారు. నిజానికి ఆర్టీసీ బస్సు లను పరిశుభ్రమంగా, సురక్షితంగా నడుపుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
బాలకృష్ణపై కంగనా రనౌత్ కామెంట్స్