దివంగత నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ 64వ జయంతి నేడు. హరికృష్ణ సినీ,రాజకీయ రంగాల్లో తన మార్క్ వేసుకుని తెలుగుజాతి గుర్తుంచుకునే వ్యక్తిగా ఎదిగారు. కాగా 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. కాగా హరికృష్ణ 64వ జయంతి సందర్భంగా హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయనను తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకుంటూ హరికృష్ణ ఫొటోతో పాటు కొన్ని మనసులోని భావాలను ట్విట్టర్ వేదికగా వ్యక్తపరిచారు. ఈ మేరకు ఎన్టీఆర్ “ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు..మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ప్రస్థానానికి నేతృత్వం మీరు . ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే -నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామారావు” అంటూ పోస్ట్ చేసారు. “మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ…. Miss You Nanna!” అని ఆయన పేర్కొన్నారు.
మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ…. Miss You Nanna! pic.twitter.com/GG11AnPbIY
— Jr NTR (@tarak9999) September 2, 2020