తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ భేటీకి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కొత్తగా రూపొందించిన పురపాలక చట్టం, రెవెన్యూ చట్టంలో మార్పులు, చేర్పులు, కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదముద్ర వేయనుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నూతన సచివాలయ భవన నిర్మాణం ప్లాన్, సర్పంచ్లు, ఉపసర్పంచ్లకు చెక్పవర్ ఇవ్వాలన్న నిర్ణయానికి ఆమోదం తెలపడంతో పాటు పలు ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది.