telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ షర్మిల

జులై 8న పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో విధివిధానాలు ప్రకటించింది షర్మిల బృందం. ఆ వివరాల్లోకి వెళితే… బెంగళూరు నుంచి 8వ తేదీన బై రోడ్ లో వైఎస్ షర్మిల ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఈ నెల 8వ తేదీ ఉదయం ఇడుపుల పాయలో 8.30 గంటలకు ప్రార్థనలు చేయనున్నారు షర్మిల. అనంతరం… కడప నుంచి ప్రత్యేక చాపర్ లో 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు వైఎస్ షర్మిల. 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… 4 గంటలకు JRC కన్వెన్షన్ కు చేరుకోనున్నారు. అనంతరం 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.

Related posts