telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయభేరి మోగించారు. మెదక్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి ఘన విజయం సాధించారు. ఒంటేరు యాదవరెడ్డికి 762 ఓట్లు, యాదవరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మలా జగారెడ్డిపై 524 ఓట్ల మెజార్టీ ఓట్లతో గెలుపొందారు. కరీంనగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

కరీంనగర్‌లో భానుప్రసాదరావు, ఎల్‌.రమణ విజయం సాధించారు. భానుప్రసాదరావుకి 584 ఓట్లు, ఎల్‌.రమణకు 479 ఓట్లు లభించాయి. కరీంనగర్ లో టీఆర్‌ఎస్‌ రెబల్ అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు 232 ఓట్లు లభించడంతో తొలి, రెండు ప్రాధాన్యత ఓట్లల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకుని విజేతలుగా నిలిచారు.

Related posts