telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం పూర్తి

disa accused encountered on escaping

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారి కాల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో వారి మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్య నిపుణులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రీపోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేశారు.

అంతకుముందు మృతదేహాలకు ఎక్స్ రే తీశారు. కాగా, రీపోస్టుమార్టం ప్రక్రియ యావత్తు వీడియోలో చిత్రీకరించారు. నివేదిక వివరాలను సీల్డ్ కవర్ లో ఉంచి ఈ సాయంత్రం కోర్టుకు సమర్పించనున్నారు. మరికాసేపట్లో దిశ నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

Related posts