వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచారసభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తనపై విజయసాయిరెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడితే తాను భరించలేనని చెప్పారు. పులివెందుల రాజకీయాలను చేయాలని చూస్తే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతాన్ని రక్తాలసీమగా మార్చారని మండిపడ్డారు. మార్పు కోసమే తాను రాజకీయాలకు వచ్చినట్టు పవన్ వ్యాఖ్యానించారు.
జగన్ హైద్రాబాద్లో కేసీఆర్ సూచించిన వారికి టిక్కెట్లిస్తే జనసేన ఒక్కటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో టిక్కెట్లను ఇచ్చిందని చెప్పారు. జనసేన కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, జగన్ కుటుంబాలే రాజకీయాలు చేయలా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను తీసుకు రాలేదన్నారు. పాత కోటలను బద్దలు కొట్టి మార్పును తీసుకురానున్నట్టు పవన్ పేర్కొన్నారు.
ఏపీ మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకు వస్తే హైదరాబాద్ పరిస్థితేంటి: శివాజీ