telugu navyamedia
రాజకీయ వార్తలు

ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలి: కేజ్రీవాల్

arvind-kejriwal

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే విషయం పై సీఎంల అభిప్రాయాలు తెలుసుకున్నారు.లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ఆయన ఈ రోజు రాత్రి ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. మోదీతో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఎత్తివేతపై పలు సూచనలు చేశారు.

కరోనా విజృంభణ ఇప్పటికీ ఆగలేదు కనుక ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేజ్రీవాల్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే అంశంపై అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చెప్పాలని మోదీ కోరారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయకపోతే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై కూడా ఆయన ప్రధానంగా చర్చిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Related posts