telugu navyamedia
క్రైమ్ వార్తలు

భార్య తల నరికిన ఐటీ ఇంజనీర్‌..

మహారాష్ట్రలో దారుణం జరిగింది. భ‌ర్త‌కు అనుమానం పెనుభూతమైంది..కంటికి రెప్ప‌లా కాపాడిల్సిన భ‌ర్తే కాల య‌ముడు అయ్యాడు..25 ఏళ్ల ఒక ఐటీ ఇంజనీర్‌ను తన భార్య(27) తల నరికి చంపేశాడు. రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా, మాథేరన్ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

ఆదివారం మాథేరన్ హిల్ స్టేషన్ వద్ద తన భార్య తల నరికి తలను లోయలో ప‌డేసిన ఒక ఐటీ ఇంజనీర్‌ను రాయ్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. పన్వేల్‌కు చెందిన రామ్‌పాల్‌ అనే వ్యక్తి తన భార్య పూనమ్‌ పై అనుమానంతో ఆమెను లాడ్జిలో హత్య చేశాడు.

మాథేరాన్‌లోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ లాడ్జ్‌లో శ‌నివారం జంట దిగారు. మ‌రుస‌ట రోజు లాడ్జ్‌ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి గది లోపలికి వెళ్లగా బాత్‌రూమ్‌లో మడుగులో మహిళ తల నరికి, బట్టలు లేకుండా మృతదేహం కనిపించడంతో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

భార్యపై అనుమానం వల్లే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని రాయగఢ్ ఎస్పీ అశోక్ దుదే తెలిపారు. వేరే వ్యక్తితో సంబంధాలు కలిగి ఉందని ఆరోపిస్తూ కోపంతో ఈ హత్య చేశాడని వెల్లడించారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్నట్లు అశోక్ వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Related posts