ఝార్ఖండ్లోని జంషెద్పుర్ లో ఓ మహిళ రైల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ట్రైన్లో పురిటి నొప్పలు వచ్చేసరికి.. ట్రైన్ టాటా నగర్ రైల్వే స్టేషన్ దాటి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది.. ఆ తర్వాతి స్టేషన్ 150 కి.మీ దూరంలోని ఉన్న హిజ్లికి చేరుకోవాలంటే కనీసం రెండున్నర గంటలు పడుతుంది. తల్లి బిడ్డ క్షేమం కోసం అధికారులు ట్రైన్ను వెనక్కి మళ్లించారు.
వివర్లాలోకి వెళితే..
టాటా నగర్ నుండి భువనేశ్వర్ కు రాణు దాస్ అనే మహిళ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఎస్5 కోచ్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చిన ఈ రైలు.. బుధవారం తెల్లవారుజామున 3.55 గంటలకు జంషెద్పుర్ సమీపంలోని టాటానగర్ స్టేషన్కు చేరుకుంది. 4.10 గంటలకు ప్లాట్ఫాం నుంచి బయల్దేరింది. స్టేషన్ దాటిన అనంతరం ఆమెకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు చైన్ లాగారు..పురిటి నొప్పులు ఎక్కువై.. రైల్లోనే ప్రసవించింది. కానీ అప్పటికే రైలు దాదాపు రెండున్నర కిలోమీటర్లు స్టేషన్ దాటేసింది.
రైలు ఆగినట్లు తెలుసుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది.. టాటానగర్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. తర్వాత మహిళ ప్రసవం గురించి వారికి తెలిసింది. మహిళ పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ను వెనక్కి పిలిపించారు. టాటానగర్ స్టేషన్లో అంబులెన్సును ఏర్పాటు చేసి.. మహిళను ఖాస్మహాల్ సదర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శిశువును ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. రైల్వే చరిత్రలో ఎప్పడూ ట్రైన్ వెనక్కి రావడం జరగలేదు..ఇదే మొదటి సారి.
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్..మసిబూసిన మారేడుకాయ: చంద్రబాబు