టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో వందల మంది పోలీసులతో వైసీపీ యుద్ధ వాతావరణం సృష్టించిందని ఆ లేఖలో యనమల పేర్కొన్నారు. మత్స్య కారులు, రైతులు, మహిళల ఆందోళనలను పెడచెవిన పెట్టిన సీఎం.. వారి జీవితాలతో చెలాగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. కోనసీమ ప్రాంతంలో రసాయన పరిశ్రమల ఏర్పాటులో మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సహా ప్రతిపక్షాల హెచ్చరికలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు యనమల. ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక వైసీపీ గాలికొదిలేసిందని ఆగ్రహించారు. ప్రశ్నించే గొంతును నొక్కేయడం.. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అశాంతి, అభద్రత నెలకొందని.. ప్రశాంతమైన గోదావరి జిల్లాలను అల్లకల్లోలంగా మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం తప్పులను సరిదిద్ధుకోవాలని హెచ్చరించారు యనమల.
next post