తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రక్రియ తుది దశకు చేరింది. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే 10 మంది పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే అంచనాతో జాబితా రూపొందిస్తోంది. రాష్ట్రంలో 16 లోక్సభ సెగ్మెంట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో పది స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో పెట్టింది. ఈ జాబితాలో నాలుగు టీఆర్ఎస్ సిట్టింగ్ సెగ్మెంట్లు ఉండటంతో ఆ ఎంపీల్లో ఆందోళన పెరుగుతోంది.
టీఆర్ఎస్ అధిష్టానం పది స్థానాలపై స్పష్టతకు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల నుంచి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం 10 మంది అభ్యర్థుల జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది.
సమాచారం ఇచ్చిన స్థానాలు:
ఆదిలాబాద్: గోడం నగేశ్
కరీంనగర్: బోయినపల్లి వినోద్ కుమార్
నిజామాబాద్: కల్వకుంట్ల కవిత
జహీరాబాద్: భీంరావు బసంత్రావు పాటిల్
మెదక్: కొత్త ప్రభాకర్రెడ్డి
భువనగిరి: బూర నర్సయ్యగౌడ్
వరంగల్: పసునూరి దయాకర్
చేవెళ్ల: జి. రంజిత్రెడ్డి
మల్కాజిగిరి: కె. నవీన్రావు
నాగర్ కర్నూల్: పి. రాములు
జగన్ సీఎం కాబోతున్నారు.. ప్రజల నాడి చూసి చెబుతున్నా: రోజా