వివాదాలకు మారుపేరుగా మారిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 26, 2019న ఈ దారుణమైన ఘటన జరగగా, నవంబర్ 26, 2020న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా వర్మ వెల్లడించాడు. ఇటీవలే ‘దిశ ఎన్కౌంటర్’ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు వర్మ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రేపు ఉదయం 9గంటల 08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ చంద్ర ఈ సినిమా దర్శకుడు. ఇక కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురిని హైదరాబాదు పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే. దీనిపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా కరోనా విపత్తు సమయంలో సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్, నగ్నం, పవర్ స్టార్ చిత్రాలను తెరకెక్కించి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
previous post