బాలీవుడ్ ప్రముఖనటి దీపికా పదుకొనే తన భర్త రణవీర్ సింగ్తో కలిసి గురువారం రాత్రి గోవా నుంచి ముంబైకు వచ్చారు. ఈ నెల 26న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల దర్యాప్తునకు దీపికా హాజరు కానున్నారు. ఈ ఇనపథ్యంలో దీపికా పదుకొనే భర్త, ప్రముఖ హీరో రణవీర్ సింగ్ నార్కొటిక్ కంట్రోలు బ్యూరో అధికారులకు తాజాగా ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. ముంబై డ్రగ్ కేసులో విచారణకు హాజరుకానున్న తన భార్య దీపికాతో కలిసి వచ్చేందుకు తనను అనుమతించాలని హీరో రణవీర్ సింగ్ ఎన్సీబీ అధికారులను కోరారు. దీపికా కొన్ని సమయాల్లో ఆందోళనతో పాటు సమస్యలతో బాధపడుతుందని, ఆమె భయపడుతుంటుందని, దీనివల్ల తనను ఆమెతో హాజరు అయ్యేందుకు అనుమతించాలని రణవీర్ అభ్యర్థించారు. దీపికా పదుకొనే మేనేజరు కరిష్మా ప్రకాష్ తో 2017లో జరిపిన వాట్సాప్ ఛాట్ బయటపడటంతో ఎన్సీబీ ఆమెకు సమన్లు జారీ చేసి శనివారం విచారించనుంది. చట్టాన్ని గౌరవించే తనను విచారణ సందర్భంగా ఎన్సీబీ కార్యాలయంలోకి అనుమతించాలని రణవీర్ చేసిన వినతిపై నార్కొటిక్ కంట్రోలు బ్యూరో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
previous post