telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐటామ్‌ సాంగ్‌లో రంగమ్మత్త !

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం”చావు కబురు చల్లగా”. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసింది చిత్రయూనిట్. కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా “చావు కబురు చల్లగా” టీజర్ ను ఇటీవల విడుదల చేసారు. ఈ సినిమాలో శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వ్యక్తిగా కార్తికేయ కనిపించనున్నాడు. ‘చావు కబురు చల్లగా’లో ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది.  ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనసూయకు ఐటెం సాంగ్ కొత్త కాదు. ఇప్పటికే విన్నర్ లో ‘సూయ సూయ అనసూయ’ అంటూ ఫ్యాన్స్ కి కిర్రెక్కించింది. ఎఫ్‌-2లోనూ ఓ పాటలో అలా మెరిసింది. ఇక జబర్దస్త్, తో పాటు పలు షోస్ లో ఐటెం సాంగ్స్ చేసి అందరినీ ఆకట్టుకున్న అమ్మడు ‘చావు కబురు చల్లగా’లో ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఆర్ ఎక్స్ 100 కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్-2 సంస్థ నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. వీలయినంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. 

Related posts