telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిర్మాత నట్టి కుమార్‌కు ఏడాది జైలు శిక్ష…

నిర్మాత నట్టి కుమార్‌కు తాజాగా చెక్‌ బౌన్స్‌ కేసులో ఈయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈయనకు ఏడాది జైలు, 50 వేలు జరిమానా విధిస్తూ విజయనగరం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ దీప దైవ కృప తీర్పు చెప్పారు.వివరాల్లోకి వెళితే 2009లో గోపీచంద్ హీరోగా శౌర్యం శివ తెరకెక్కించిన శంఖం సినిమా సమయంలో దానికోసం డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న నట్టి కుమార్‌ విజయనగరంలోని రాజ్యలక్ష్మి థియేటర్‌ యజమాని రవికుమార్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి గానూ 6.50 లక్షలు చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. కానీ ఒప్పందం చేసుకున్న దానికంటే ముందే శంఖం సినిమాను తీసేసి మరో థియేటర్‌కు అప్పగించారు. రవికుమార్‌కు 5.50 లక్షలకు సంబంధించి చెక్కు ఇచ్చాడు నట్టి కుమార్. కానీ ఈ చెక్‌ను బ్యాంకులో వేయగా బౌన్స్‌ అయ్యింది. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఆ థియేటర్ ఓనర్ నట్టి కుమార్‌ను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు రవికుమార్. నేరం రుజువు కావడంతో ఏడాది జైలు, 50 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Related posts