telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

ఏపీలో .. పిడుగుల వర్షం.. ఖాయం .. అప్రమత్తంగా ఉండాలి .. : విపత్తు శాఖ

Thunderstorms in AP

ఏపీలో మూడు జిల్లాలకు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ పిడుగు హెచ్చరికను జారీ చేశారు. గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పిడుగు పడే అవకాశముందని తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఆయా జిల్లాల్లోని ఏయే ప్రాంతాల్లో పిడుగు పడనుందో కూడా తెలిపారు.

గుంటూరు జిల్లా : మాచెర్ల, దుర్గి, వెల్దుర్తి, రెంటచింతల గురజాలలో;
కడప జిల్లా : వీరబల్లి, టి-సుండుపల్లె, రాజంపేట, చిట్వేల్ మండలాల పరిసర ప్రాంతాలలో;
నెల్లూరు జిల్లా : దక్కిలి, రాపూర్ జిల్లాల్లో పిడుగు పడే అవకాశముందని తేల్చారు.

ఈ జిల్లాలకు చెందిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ కమిషనర్ తెలిపారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

Related posts