telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు క్రీడలు రాజకీయ వార్తలు

భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు

అర్జున అవార్డు విజేత జ్యోతికి ఏపీ కేబినెట్ తీపికబురు వినిపించింది. జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది.

జ్యోతి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమెకు గ్రూప్‌ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సందర్బంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

2025లో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి నారా లోకేశ్ ఆమెకు అభినందనలు తెలియజేస్తూ ఆర్ధిక సహాయం చేశారు.

Related posts