సినిమా, టీవీ రంగాల్లో సుప్రసిద్ధ నటులు బి . రాజబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. రాజబాబు మరణించారని వార్త తెలుసుకున్న సినిమా నటీనటులు , టీవీ రంగంలో ఆయన సహా నటులు ఎందరో వచ్చి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అదే రోజు ఎర్రగడ్డ స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
రాజబాబు అంటే ఎంతో మంది అభిమానిస్తారు. అందరినీ ఆయన ఆత్మీయులుగా భావిస్తారు. రాజబాబు స్మృతులను గుర్తు చేసుకోవడానికి బంధువులు, స్నేహితులు మరియు నవ్య మీడియా డాట్ కామ్ గురువారం రోజు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ ఫిలిం నగర్ లోని నిర్మాతల మండలి హాలులో సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ సభలో నిర్మాతలు, దర్శకులు , నటీనటులు పాల్గొని నివాళులర్పిస్తారు.