telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి: బుగ్గన

ap ministers meet to accept budget

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అధెవిధంగా ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారుస్తామని అన్నారు. ఏపీ అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను బుగ్గన ఈరోజు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు వైఎస్సార్ కల్యాణ కానుక కింద రూ.300 కోట్లు అందిస్తున్నామని తెలిపారు.

ఎస్సీలకు కల్యాణ కానుక కింద రూ.200 కోట్లు కేటాయించామన్నారు. ఎస్టీలకు గిరిపుత్రిక కల్యాణ కానుక కింద రూ.45 కోట్లు కేటాయించామని చెప్పారు. ముస్లిం మైనారిటీకు షాదీ కా తోఫా కింద రూ.100 కోట్లు ఇస్తున్నామన్నారు. కులాంతర వివాహాలు చేసుకునేవారిని ప్రోత్సహించేందుకు రూ.36 కోట్లను 2019-20 బడ్జెట్ లో కేటాయించామని తెలిపారు.

Related posts