తెలంగాణలో అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత పై వాదనలు జరిగాయి. ఎర్రమంజిల్లోని 150 ఏళ్ల క్రితం కట్టడంపై మరోసారి వాదనలు జరిగాయి. 2015 పురాతన భవనాల జాబితా నుంచి ఎర్రమంజిల్ ప్యాలెస్ను, ప్రభుత్వం కావాలనే తొలగించిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సుదీర్ఘ వాదనల అనంతరం దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.