జనసేన-బీజేపీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. పవన్ దిల్లీ వెళ్లినపుడు అమరావతి కోసం అనుకున్నామని చెప్పారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులోని రైతులు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పవన్ తీసుకున్న నిర్ణయంతో సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేశామని.. అంతకుమించి ఆయనతో సయోధ్య లేదన్నారు.
గతంలో తెదేపాతో ఉన్న పవన్.. ఇప్పుడు భాజపాతో వెళ్లారని, అది అతని ఇష్టమని నారాయణ వ్యాఖ్యానించారు. గొప్పవాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పార్టీ పెట్టిన వారందరు వారి విలువలు పాటించలేక పారిపోతుండటం తన అనుభవంలో చాలా చూశామని, అదే జరిగిందని నారాయణ అన్నారు.