రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తూ తెలంగాణ కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వాళ్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. ఇక కోవిడ్ నిబంధనల సడలింపు నేపథ్యంలోనే ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది.
previous post


రథం దగ్ధంపై చంద్రబాబు కమిటి..విజయసాయి విమర్శలు