telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : సెకండాఫ్ ప్రారంభానికి ముందే కేకేఆర్ కు షాక్…

సెకండాఫ్ ఐపీఎల్ 2021 మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్ కాకుండా ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఈ స్టార్ పేసర్ దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేశాడు. ఇక కుటుంబంతో గడిపేందుకు డేవిడ్ వార్నర్ కూడా ఈ పర్యటన నుంచి తప్పుకున్నాడు. అయితే ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండాలనుకున్నట్లు కమిన్స్ ఇప్పటికే ప్రకటించాడు. ‘డేవిడ్ వార్నర్​తో పాటు ప్యాట్​ కమిన్స్​.. వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉండాలనుకున్నారు. మిగిలిన వారు యథావిధిగా మ్యాచ్​ల్లో పాల్గొంటారు. ఐపీఎల్​ 2021 మిగతా లీగ్​లో పాల్గొనని విషయాన్ని కమిన్స్​ ఇప్పటికే వెల్లడించాడు. రూ.15 కోట్ల భారీ కాంట్రాక్టు ఉన్నప్పటికీ ఈ స్టార్ పేసర్.. క్యాచ్ రిచ్ లీగ్ ఆడేందుకు సుముఖంగా లేడు. అందుకు ప్రత్యేక కారణమేమీ లేదు.’ అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్​ పత్రికా కథనం ప్రచురించింది. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్​ యాష్లే గైల్స్​ కూడా ఐపీఎల్​ కోసం తమ జట్టు ఆటగాళ్ల షెడ్యూళ్లలో మార్పులు చేయబోమని తెలిపారు.

Related posts