telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్… ఢిల్లీ టార్గెట్…?

ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ కు దిగ్గిన చెన్నై లో బ్యాట్స్మెన్స్ అద్భుతంగా రాణించారు. వరుస ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ కు చేరుకున్న ఆ తర్వాత వచ్చిన మోయిన్ అలీ(36) తో రాణించగా రైనా(54) అర్ధశతకంతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ధోని డక్ ఔట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. కానీ ఆ తరవాత వచ్చిన సామ్ కర్రన్ 15 బంతుల్లో 34 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. దాంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, అవెష్ ఖాన్ రెండేసి వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్, టామ్ కర్రన్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే 189 పరుగులు చేయాలి. అయితే చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts