telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో కరోనాపై సరైన లెక్కలు చెప్పాలి: యనమల

Yanamala tdp

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కరోనాపై సరైన లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాగే కరోనా కేసులు పెరిగితే మే 3 నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,000కు చేరుతాయని తెలిపారు.

కేంద్ర అధికారుల బృందంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులను పరిశీలించేందుకు రెండు రోజుల్లో ఏపీకి వస్తుందని గుర్తు చేశారు.తాము కేంద్ర బృందాన్ని కలిసి, రాష్ట్రంలో కరోనా వైరస్‌ను వైసీపీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని వారికి ఫిర్యాదు చేస్తామని యనమల చెప్పారు. వైసీపీ నేతలే కరోనా వ్యాప్తి ఇంతగా జరగడానికి కారకులయ్యారని అన్నారు. కరోనా కేసులు పెరిగితే ఇన్‌ఫెక్షన్ రేటు ఎలా తగ్గుతుందని ఆయన ప్రశ్నించారు.

Related posts