telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతి భవన్ ను ముట్టడించిన టీఆర్టీ అభ్యర్థులు!

pragati bhavan hyd

తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం వద్ద ఈ రోజు ఆందోళన చేపట్టారు. ప్రవేశ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలన్న డిమాండ్ తో కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించారు. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. ఫలితాలు వచ్చి 7 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు టీఆర్టీ అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పోస్టింగులు ఇస్తామని చెప్పి అర్దరాత్రి విద్యా వాలంటీర్లను నియమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆమరణ నిరాహారదీక్షలు చేపడుతామని వారు హెచ్చరించారు.

Related posts