తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం వద్ద ఈ రోజు ఆందోళన చేపట్టారు. ప్రవేశ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలన్న డిమాండ్ తో కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించారు. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. ఫలితాలు వచ్చి 7 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు టీఆర్టీ అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పోస్టింగులు ఇస్తామని చెప్పి అర్దరాత్రి విద్యా వాలంటీర్లను నియమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆమరణ నిరాహారదీక్షలు చేపడుతామని వారు హెచ్చరించారు.