telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వైరస్‌పై సీఎం జగన్ కొత్త అర్థాలు: సోమిరెడ్డి

somireddy chandramohan

ప్రపంచాన్నిఅతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ విషయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కొత్త అర్థాలు చెబుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కరోనా అంటే చిన్నపాటి పాటి జ్వరమని సీఎం సెలవిస్తున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై అయనకున్న చిన్నచూపునకు నిన్నటి ప్రెస్‌మీటే నిదర్శనమని సోమిరెడ్డి దుయ్యబట్టారు.

‘కరోనా అంటే చిన్నపాటి జ్వరమని, వస్తాది.. పోతాది..అని జగన్‌ సెలవిస్తున్నారు. కరోనా వైరస్ ప్రధానంగా శ్వాసకోస వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని, ప్రాణాంతకమని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తుంటే సీఎం మాత్రం కొత్త అర్థాలు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యంపై ఆయనకున్న చిన్నచూపునకు నిన్నటి ప్రెస్ మీటే నిదర్శనం.’అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.

Related posts