మహిళలపై జగన్ కక్ష దేనికో అర్థం కావడంలేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ట్విట్టర్ వేదికగా లోకేష్ దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ.. మహిళా అధికారిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు.
“రాక్షసపాలనలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళలపై జగన్ గారికి కక్ష దేనికో అర్థం కావట్లేదు. 45 ఏళ్లకే పెన్షన్ అని మోసం చేశారు. మద్యపాన నిషేధమని ఇళ్ల మధ్యే సారా దుకాణాలు తెరిచి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మహిళా అధికారిణిపై వైసీపీ రౌడీ ఎమ్మెల్యే దాడి చేశారు.
అవినీతి, అక్రమాలకు సహకరించకపోతే చంపేస్తామంటూ మహిళా ఎంపీడీవో సరళ గారిపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైసీపీ పాలనలో మహిళా అధికారిణి బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక రాష్ట్రంలో ఉన్న సామాన్య మహిళల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళన కలుగుతోంది” అని లోకేష్ ట్వీట్ చేశారు.
కోడెలను టీడీపీ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదు: అంబటి