telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?: చంద్రబాబు

chandrababu

నిజాయితీగా ఉన్న మహిళ ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విధి నిర్వహణలో నిజాయతీగా ఉన్నందుకు ఓ మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయం కోసం మహిళా అధికారి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కేసు తీసుకోవడానికే జంకారంటే పోలీసింగ్ ఉన్నట్టా? లేనట్టా? అని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళా అధికారులని కూడా చూడరా? ఆ అధికారి ఇంటికి కరెంట్ నీటి కనెక్షన్‌ను కట్ చేస్తారా? అని మండిపడ్డారు.

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఉంటే సీఎంకు ఇవేమీ కనపడవా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జర్నలిస్టును చంపుతానని ఫోన్లో బెదిరించాడన్నారు. ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చరిత్ర ఈయనది అని అన్నారు. అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని ఆయన ట్వీట్ చేశారు.

Related posts