telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు: కనకమేడల

MP kanaka Medala comments elections

ప్రజా చైతన్య యాత్రలో బాగంగా విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వాహనంపై వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటన పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

తాజాగా టీడీపీ ఎంపీ కనకమేడల స్పందిస్తూ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత కల్పించడంలో జగన్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని దీనికి సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని శాంతి భద్రతలు పర్యవేక్షించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించినవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related posts