telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం..

ఏపీలో మద్యం అమ్మకాలపై వరుసగా 5వ రోజు టీడీపీ నిరసనకు దిగింది. కల్తీ నాటు సారాతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంతో పాటు రాష్ట్రంలో జేబ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ టీడీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న టీడీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిషేకం చేశారు. సీఎం ఫోటోపై మద్యం పోసి వినూత్నరీతిలో నిరసన చేపట్టారు.

మద్యం నిషేదం హామీ గోవిందా గోవిందా అని నినాదాలు చేశారు. కల్తీసారాతో పాటు జె బ్రాండ్లతో ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శన చేశారు నేతలు. రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని మండిపడ్డారు

Related posts